ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 12:15 PM

తిరుప‌తి జిల్లా పాకాల మండలం మద్దినాయన పల్లి పంచాయతీ ఐయ్య వారిపల్లి లో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు శంకర్ పై టీడీపీ నేత‌లు దాడి చేసి గాయపరిచారని వైసీపీ నాయకులూ వాపోతున్నారు. వారు మాట్లాడుతూ...  గ్రామ కంఠం, చెరువు పోరంబోకు స్థలం ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించినందుకు శంక‌ర్‌పై దాడి చేశారు. శంకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. టీడీపీ నాయ‌కుల దాడిని ఖండిస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa