ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:14 PM

ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును ఈరోజు (మంగళవారం) మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు హాజరుపర్చారు. ఉదయం గుంటూరు జీజీహెచ్‌‌లో శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తరలించారు.ఏపీ రాజధానిపై, రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సాక్షి ఛానల్‌లో జరిగిన డిబేట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌‌లో రాజధాని ప్రాంతం మహిళగా ఉన్న తెలుగు దేశం పార్టీ దళిత నాయకురాలు కొమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కృష్ణం రాజు, ఏ2గా కొమ్మినేని శ్రీనివాస్ రావు, ఏ3గా సాక్షా యాజమాన్యాన్ని చేర్చారు. కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు నిన్న (సోమవారం) హైదరాబాద్‌లో ఏ2 కొమ్మినేని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సాయంత్రానికి గుంటూరుకు తీసుకొచ్చారు.గత రాత్రి మొత్తం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపిన పోలీసులు ఈరోజు ఉదయం గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపర్చారు. వాదనలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదుదారు శిరీష కూడా తన న్యాయవాదులతో వచ్చి జడ్జి ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారనే అంశంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కులపరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని వైసీపీ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది. కొమ్మినేనికి రిమాండ్‌ విధిస్తారా లేదా అనే తెలియాల్సి ఉంది. మరోవైపు జర్నలిస్టు కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa