ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై అనుచితముగా మాట్లాడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:26 PM

ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జర్నలిస్టు చేసిన అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa