మరోసారి భూమి కంపించింది. దక్షిణ అమెరికాలోని పెరూలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. భూకంప ప్రభావం లిమా నగరంలో ఎక్కువగా కనిపించింది. అక్కడ దుమ్ము, ఇసుక, రాళ్లు ఒక్కసారిగా పైకి ఎగసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. దీంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలాలకు చేరుకున్నాయి. భూకంపం కారణంగా ఒకరు మరణించారని.. 5 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. రోడ్లు చాలా వరకు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు. అదే సమయంలో అనేక భవనాలు నేలకూలాయని తెలిపారు. దీంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. లిమా నగరంలో భూకంపం సంభవించినప్పుడు ఒక వ్యక్తి తన కారు దగ్గర నిలబడి ఉన్నాడు. అదే సమయంలో భారీ భూకంపం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోయి అతనిపై పడిపోయింది. దీంతో శిథిలాలు అతనిపై పడ్డాయని.. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అతడు స్పాట్లోనే చనిపోయాడని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే పెరూలో భూకంపాలు ఎప్పటికప్పుడు సంభవిస్తూనే ఉంటాయి. 1970లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇది దాదాపు 67000 మందిని బలిగొంది. దాని తర్వాత 2021లో పెరూలో అతిపెద్ద భూకంపం సంభవించింది. అమెజాన్ ప్రాంతంలో ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa