ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైప్రస్ పర్యటనలో మోదీ

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 03:25 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా నిన్న‌ ఆ దేశంలో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ స్పష్టం చేశారు.ఆదివారం సైప్రస్ రాజధాని నికోసియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక ఆదరణకు గాను ఆ దేశ‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియ‌జేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa