ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప నగరపాలక సంస్థలో మరోసారి కుర్చీ వివాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 12:32 PM

AP: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం తలెత్తింది. ఇప్పటికే రెండు సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై వివాదం నెలకొంది. ఇవాళ్టి సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా.. మేయర్ మీటింగ్‌ను తన ఛాంబర్‌లో ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa