ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తోంది. తాజాగా సీఎం సహాయ నిధుల ద్వారా వెన్నపూస సమస్యతో బాధపడుతున్న సరలాదేవి అనే మహిళకు రూ. 6,59,323 విలువైన చెక్కును ఆర్థిక సహాయంగా మంజూరు చేసింది. ఈ నిధులు ఆమె చికిత్స కోసం ఉపయోగపడనున్నాయి.
ఈ చెక్కును ఎంపీ అంబికా ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. చెక్కు అందజేసిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ, "ఇలాంటి సమస్యలకు త్వరితగతిన స్పందించి సహాయం అందించేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు" తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడేందుకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారి చికిత్సకు అవసరమైన నిధులను సమయానికి అందించేందుకు కట్టుబడి ఉన్నదని ఎంపీ పేర్కొన్నారు. ప్రజా సేవే తమ లక్ష్యమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa