ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ పిల్లలతో చేత్త ఎత్తివేయిస్తారా... ఆర్.కె.రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:05 PM

మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతిపక్ష వాణి బలంగా వినిపిస్తున్నారు రోజా. విలేకర్ల సమావేశాలతో పాటుగా.. సోషల్ మీడియా ద్వారా కూడా రోజా తన గొంతు వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ ఘటనను మాజీ మంత్రి రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను రోజా కోరారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమంటూ రోజా ట్వీట్ చేశారు.


" ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్‌లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు! “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?” అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా? నారా లోకేష్ గారు పేద పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి" అంటూ రోజా ట్వీట్ చేశారు.


మరోవైపు రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. కుప్పం నియోజకవర్గానికి పొరుగున ఉంటుంది. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ సమస్యలను కూడా రోజా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోవైపు రోజా చేసిన ట్వీట్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదీ చూడాల్సి ఉంది. దీని వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అండ చూసుకుని ఓ కానిస్టేబుల్ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తిరుపతి జిల్లాకు చెందిన ఓ కుటుంబం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. రోజా అండతో మునికుమార్ అనే కానిస్టేబుల్‌ తనను ఇబ్బంది పెడుతున్నారని వడమాలపేట మండలం సీతాపురంలో ఉండే డి.గుణశేఖర్‌ ఫిర్యాదు చేశారు. తన భూమిని వారికి నచ్చిన ధరకు అమ్మటం లేదనే కోపంతో.. దొంగ రిజిస్ట్రేషన్‌ అగ్రిమెంట్‌ తయారు చేసుకుని.. అలాగే పొలానికి వెళ్లే దారికి అడ్డుపడుతున్నారని ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa