ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూట‌మి మేనిఫెస్టో హామీల మోసాల‌ను ప్రజల్లోకి తీసుకెళతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 10:46 AM

ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో   వైయ‌స్సార్సీపీ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం'చంద్ర‌బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్ట‌ర్‌ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూట‌మి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాల‌ను ప్ర‌జ‌లంద‌రికీ గుర్తుచేయ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో 'రీకాలింగ్  చంద్రబాబూస్ మేనిఫెస్టో' కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa