చంద్రబాబు చేసిన వంచనను ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలని కాకినాడ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ నగరంలో వైయస్ఆర్ సీపీ జిల్లా విస్తృత స్ధాయి సమావేశం దాడిశెట్టి రాజా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రిజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రిజనల్ కో-అర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..`పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామి పేరు మీద విడుదల చేసిన మానిఫెస్టో లో హమీలు ఏమయ్యాయి. కాపులకు ఐదేళ్లలో 15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైయస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో ఇంటింటా ప్రచారం చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం` అని దాడిశెట్టి రాజా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa