కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైయస్ జగన్పై కుట్రలకు పాల్పడుతున్నాడని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు మూడు రోజుల్లోనే తమ మాటను మార్చడం వెనుక చంద్రబాబు పన్నిన కుతంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా, వైయస్ జగన్కు భారీగా ప్రజాధరణ వస్తుండటంను జీర్ణించుకోలేక తప్పుడు కేసులతో దిగజారుడు రాజకీయంకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగయ్య మృతికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరించిందో అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని పత్రికాముఖంగా బయటపెట్టి ఈ ప్రభుత్వ నీచాన్ని ప్రజలకు చూపిస్తున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa