ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిర్యాదులపై తొందరపాటు చర్యలు వదంటున్న కోర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 11:45 AM

వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్‌ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. లోకేశ్‌ ఫిర్యాదు ఆధారంగా లక్కిరెడ్డిపల్లె పోలీసులు ఈనెల 25న కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, మరో 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌ వాదనలు వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa