ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 12:43 PM

ఏపీ ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు  ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా వైయ‌స్ జ‌గ‌న్‌ ట్వీట్‌ చేశారు.ఎక్స్ వేదిక‌గా ........ ‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా  ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు  క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం  34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa