ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 12:57 PM

అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్‌ని లారీ ఢీ కొట్టింది. దీంతో టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ను పోలీస్ అధికారులు క్రమబద్దీకరిస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. ఈ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa