AP: గోదావరిలో నీటిమట్టం పెరగడంతో పాపికొండుల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అల్లూరి జిల్లా దేవిపట్నం నుంచి ఈ యాత్రను జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. దేవిపట్నం మండలంలోని రెండు గ్రామాల మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటిమట్టం తగ్గిన తరవాత విహారయాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa