మన శరీరానికి నిద్ర ఎంత అవసరమో, సమయానికి తీసుకున్న చిన్న విశ్రాంతి కూడా అంతే అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య 10 నుంచి 30 నిమిషాల వరకూ నిద్రపోవడం వల్ల శరీరానికి మంచి ఊరట కలుగుతుంది. అలసట పోయి, మేధస్సు స్పష్టంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలా మానసిక శ్రమ ఎక్కువగా చేసే వారు ఈ చిన్న విరామాన్ని తీసుకుంటే పనితీరు మెరుగవుతుంది.
పగటి కునుక వల్ల జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది, దైర్యం, ఉత్సాహం పెరుగుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది సహాయపడుతుంది. అలాగే, జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా పని చేస్తుంది. నిద్ర తర్వాత మెలకువలోకి వచ్చినప్పుడు మనశ్శాంతి, చిత్తశుద్ధి అనుభవించవచ్చు. కునుకు చిన్నదే అయినా, దాని లాభాలు ఎంతో పెద్దవిగా ఉంటాయి.
అయితే, నిద్రకు కూడా సరైన సమయం ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 4 తర్వాత నిద్రపోవడం రాత్రి నిద్రపై ప్రభావం చూపవచ్చు. అలాగే, భోజనం తర్వాత టీ, కాఫీ, చాక్లెట్ వంటి ఉత్సాహదాయక పదార్థాలను తీసుకోవడం మానుకోవాలి. మొబైల్ ఫోన్లు, టీవీలు చూస్తూ నిద్రించే అలవాట్లను కూడా నివారించాలి. సరైన సమయానికి, సరిగ్గా కునుకు తీసినపుడు అది ఆరోగ్యానికి వరంలా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa