ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పర్యటన సందర్భంగా రైతులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా పంటల దిగుబడి వచ్చినట్లు చెప్పారు. ఇది రైతుల కృషి ఫలితమేనని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారి వెన్నంటగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో, ఏ పంట పండిస్తే లాభదాయకమవుతుందో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని సీఎం తెలిపారు. పంటల విలువ పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల ఆదాయం పెరిగేలా మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పై చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు తెలిపారు. రైతులకు అన్ని విధాలా మద్దతు ఇస్తామని, కొత్త సాంకేతికతను అందుబాటులోకి తేచే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే అభివృద్ధి మార్గమని, రైతు క్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa