ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకి అండగా నిలిచిన మాపై విమర్శలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 03:53 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహా లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. కారు కిందపడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ధ్వజమెత్తారు. కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ(గురువారం) ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను మీరు ఆదుకోకపోగా.. పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తానేప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa