ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.లక్షకే బెస్ట్ కార్ అంటూ ఆఫర్స్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 09:36 PM

కారు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. సెకండ్ హ్యాండ్‌లో కొనాలన్నా కూడా ఎంత లేదన్నా 2,3 లక్షలు ఖర్చు చేయంది మంచి కండిషన్‌లో ఉన్న కారు రాదు. ఇక కొత్త కారు కొనాలంటే లక్షలకు లక్షలు పోయాల్సిందే. ఒకవేళ మీరు కూడా ఇలా కారు కొనాలనే ఆలోచనలో ఉంటే మీకోసమే ఈ ఆఫర్. రూ.లక్ష, లక్షన్నరకు కారు మంచి కార్లు అమ్మకానికి పెడుతున్నారు. ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడంటే..


కారు కొనాలనుకువారు ఢిల్లీ వెళ్లడం బెస్ట్ అంటున్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో లగ్జరీ కారు సైతం చాలా తక్కువ ధరకు వస్తుందట. కారణమేంటంటే.. ఢిల్లీ ప్రభుత్వం పాత వాహనాలకు సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయం. ఢిల్లీ ప్రభుత్వం జీవితకాలం ముగిసిన సుమారు 60లక్షల వాహనాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో బైకులు, కార్లు, ఆటోలు, లారీలు, రవాణా వాహనాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయి.


ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం రేఖా గుప్తా ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వెహికల్స్ రోడ్డుపై తిరగటానికి అనుమతి లేదని తెలిపింది. జీవితం కాలం ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే జనాల్లో కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు కాకపోతే మరి కొన్నాళ్లకైనా సరే ఇలాంటి వాహనాల మీద నిషేధం విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వాటిని అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు.


ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీలో అమ్మకానికి ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ట్రేడర్లు చెబుతున్నారు. దీంతో ధరలు 40-50 శాతం పడిపోయాయని వెల్లడించారు. ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే ఇప్పుడు అమ్మకానికి వచ్చిన కార్ల సంఖ్య పెరగటంతో వాటిని కొనేవారు కూడా రేట్లు భారీగా తగ్గించి అడుగుతున్నట్లు తెలుస్తుంది.


కొన్ని నెలల క్రితం వరకు కూడా ఒక లగ్జరీ కారు రూ.6-రూ.7 లక్షలు పలకగా .. ప్రస్తుతం వాటిని రూ.4-రూ.5 లక్షలకు అడుగుతున్నారని ఢిల్లీ ట్రేడర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కార్లు అమ్మడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను పొందడం కూడా కష్టతరంగా మారిందని అంటున్నారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఖరీదైన ఎస్యూవీలు, లగ్జరీ కార్లనే రూ.4 నుంచి రూ.5 లక్షలకు అడుగుతున్న నేపథ్యంలో అనేక బేసిక్ మోడల్ వాహనాలను అక్కడి కారు ఓనర్స్ రూ.లక్ష నుంచి 2 లక్షలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నారు. కనుక కారు కొనాలనుకునే వారు.. సరిగ్గా వెతుక్కుంటే లక్ష రూపాయలకే ఒక మంచి కారును సొంతం చేసుకోవచ్చని ట్రేడర్లు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa