జమ్ముకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో స్వల్ప ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని చందర్కోట్ దగ్గర ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. బస్సుల బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సులు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల అదుపు తప్పాయి. దీంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాత్రా కాన్వాయ్లోని ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి అని అధికారులు తెలిపారు. అంటే, బస్సుల బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై రాజకీయ ప్రముఖుులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలైంది. ఇది ఆగస్టు 9 వరకు, అంటే రక్షా బంధన్ వరకు కొనసాగుతుంది. యాత్రికులు సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహకు రెండు మార్గాల ద్వారా వెళ్తారు. ఒకటి పహల్గామ్ మార్గం, మరొకటి బాల్తాల్ మార్గం. యాత్రలో భాగంగా శనివారం 6,979 మంది యాత్రికులు జమ్ము నుండి కశ్మీర్కు బయలుదేరారు. వీరికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు. జులై 3న ప్రారంభమైన యాత్ర 38 రోజుల పాటు జరుగుతుంది. గత రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్ లోని అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో సహజంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకోడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు
కొత్త బ్యాచ్ యాత్రికులు భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలలో బయలుదేరారు. వీరి కోసం రెండు ఎస్కార్ట్ కాన్వాయ్లను ఏర్పాటు చేశారు. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్కు, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్కు వెళ్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి అమర్నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమైంది. దీనిలో భాగంగా యాత్రికుల మొదటి బృందం బయలుదేరింది. పహల్గాం దాడి తర్వాత వచ్చిన అమర్నాథ్ యాత్ర కావడంతో ప్రభుత్వం ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతతో నిర్వహిస్తున్నారు. అలానే అమర్నాథ్ యాత్ర మార్గాన్ని మరింత సురక్షితంగా మార్చడం కోసం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం మొత్తం ఈ మార్గాన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa