మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాధవ్కు ఈ సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాధవ్కు శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa