ఏపీఎండీసీ బాండ్ల జారీలో రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెడతామనడం వారి దివాలాకోరుతనంకు నిదర్శనమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రలు చేసిందని, ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్ధిక సంస్థలకు మెయిల్స్ చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగం నిబంధనలనే ఉల్లంఘిస్తూ చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని న్యాయ స్థానాలను కోరితే రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ, కోర్టుకు తప్పుడు ఫిర్యాదులు చేయించిన వైయస్ జగన్, బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆర్ధిక మంత్రి కేశవ్ అర్థంలేని వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa