ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రుల గొడవ.. త్రిశూలం మృత్యుదూతగా మారి 11 నెలల శిశువు బలి

national |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 03:21 PM

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో ఒక కుటుంబాన్ని విషాదంలో ముంచేసిన ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. సచిన్ మెంగ్వాడే, పల్లవి అనే దంపతులు తరుచూ గొడవ పడుతుండేవారు. గురువారం జరిగిన ఘర్షణ మరింత తీవ్రతకు దారి తీసింది.
ఆ గొడవను అడ్డుకోవడానికి వచ్చిన సచిన్ అన్న నితిన్‌ పరిస్థితిని శాంతింపజేయాలని ప్రయత్నించాడు. ఆ క్షణంలో పల్లవి తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న త్రిశూలాన్ని నితిన్‌పై విసిరింది. అయితే నితిన్ దానిని తప్పించుకునేందుకు పక్కకు తప్పుకున్నాడు. అదే సమయంలో మృత్యువు దారిని మార్చింది.
త్రిశూలం నేరుగా వెనకాల ఉన్న నితిన్ భార్య చేతుల్లోని 11 నెలల శిశువు అవదూత్ తలలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబసభ్యులు షాక్‌కు గురై, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa