ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ సిట్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సి ఉన్నా, ఆరోగ్య సమస్యల కారణంగా అందులో విఫలమయ్యారు. అయితే సిట్ నుంచి తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, చివరికి ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆయన పదవిలో ఉన్న సమయంలో లిక్కర్ విధానం, జీవోలు, లావాదేవీలు వంటి అంశాలపై అనేక విమర్శలు వచ్చాయి. అదే నేపథ్యంలో ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని భావించిన సిట్, విచారణకు పిలిచింది.
ప్రస్తుతం సిట్ అధికారులు రజత్ భార్గవ్ను పలు కీలక ప్రశ్నలతో అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ విధానంలో జరిగిన మార్పులు, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత లేని అంశాలు, పాలసీల రూపకల్పనలో తీసుకున్న నిర్ణయాలు వంటి విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే విషయాలు, ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa