ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పథకాలకు పేరు మార్చడం తప్ప, సొంత ఆలోచన చంద్రబాబుకి ఉందా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 05:30 PM

ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే  జనం ఎగరేసి కొడతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చ‌రించారు. శుక్ర‌వారం కొండపి నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.... పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖ‌మంత్రి అంటే ఎలా ఉండాలో  ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు  వైయ‌స్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే  భయపడటానికి ఇక్కడ ఉన్నది  లోకేష్ కార్యకర్తలు కాదు... వైయ‌స్ జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే  జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి  రోజా అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa