డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వందల సంఖ్యలో ఉన్నతాధికారులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ తొలగింపు జాబితాలో 1,107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల సమాచారం మేరకు, వీరికి లేఆఫ్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది.నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లు 120 రోజుల పాటు సెలవుల్లో ఉంటారని, ఆ తర్వాత వారిని అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎక్కువ మందికి 60 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యతలపై దృష్టి సారించామని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో పాటు వారి మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. అయితే, ప్రస్తుత మరియు మాజీ దౌత్యవేత్తలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యల వలన విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం బలహీనపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగాల కోతలను నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారెన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశీ సేవలు అందించే ఈ విభాగానికి అంతరాయం కలిగించడం జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై దీని ప్రభావం పడుతుందని సంస్థ అధ్యక్షుడు టామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa