ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సింగ్ చదివిన ఎస్సీ యువతకు జర్మన్ వెళ్లే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 04:04 PM

నర్సింగ్ విద్య పూర్తి చేసిన ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నర్సింగ్ మరియు జీఎన్ఎం చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ యువతకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి, అనంతరం వారికి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa