ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ హయాంలో రాష్ట్రము అన్నివిధాలా నష్టపోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 03:59 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) యస్ రాయవరం మండలం రామయ్యపట్నం గ్రామంలో హోం మంత్రి అనిత పర్యటించారు. రామయ్యపట్నంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రామయ్యపట్నం గ్రామంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు లేవని.. ప్రజల యోగక్షేమాలని తెలుసుకోవడానికే తాను రామయ్యపట్నం వచ్చానని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభమవుతుందని..త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని నొక్కిచెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa