ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 07:03 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై వాడీవేడిగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోని రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ నీరు మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును డిజైన్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తమకు నష్టం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుంది. ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజేసిన సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే గోదావరి వరదపై టీడీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి నదికి వరదలు వచ్చాయి. ఈ వరద నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గోదావరి వరదను ఆపండంటూ తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై ఆయన విమర్శలు చేశారు. రోజుకు 50, 60 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నడుస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.


గోదావరి వరద నీరు వృథాగా పోవడంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ నాయకులపై ఆయన వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. బీఆర్ఎస్ నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా.. కనీసం కాంగ్రెసోళ్లు చెంబులతో అయినా ఆపండయ్యా. రోజుకు 50, 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారు మీరు అని ఆయన ట్వీట్ చేశారు. అంటే గోదావరి వరద నీరు వృథాగా సముద్రం పాలవుతుందని.. మరి దీన్ని బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎలా అరికడతారో తెలపాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి ఇలా పరోక్షంగా విమర్శలు చేశారని అంటున్నారు.


ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు గురించి పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్.. సుమారు 200 టీఎంసీల గోదావరి వరద నీటిని వాడుకోవాలని ఆలోచిస్తోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఈ నీటిని తరలించాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇందుకోసం బనకచర్ల ప్రాజెక్టును ప్లాన్ చేసింది. కానీ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు గోదావరి నీటి వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెబుతోంది. ఈ వివాదం నడుస్తుండగానే సోమిరెడ్డి ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.


బనకచర్ల ప్రాజెక్టు కడితే.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని కాంగ్రెస్ పార్టీతో ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు కొరత ఏర్పడుతుందని అభ్యంతరం చెప్పింది. వృథాగా పోతున్న గోదావరి వరద నీరు తెలంగాణకు కూడా అవసరం ఉందని పేర్కొంది.


ఆదివారం లష్కర్ బోనాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లను ఏర్పాటు చేళశారు. 2500 మంది పోలీసులతో జాతర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల సందర్భంగా నేడు, రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్ చేశారు. జాతర నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa