జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా ఈ ప్రమాదంలో 274 మంది చనిపోగా.. శనివారం రోజే ఇందుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెలుగులోకి వచ్చింది. రెండు ఇంజిన్లకు రెప్పపాటు వ్యవధిలో ఇంధర సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అందులో వెల్లడించారు. అయితే తాజాగా దీనిపై సుప్రసిద్ధ ఏవియేషన్ భద్రతా నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ స్పందించారుయ. ఈ విమానం ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఇద్దరు పైలెట్లలో ఎవరో ఒకరు కావాలనే ఇంధనం స్విచ్ ఆఫ్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ప్రకటన విమానయాన రంగంలో ముఖ్యంగా ప్రమాదాల దర్యాప్తుల పట్ల తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మోహన్ రంగనాథన్ తన వాదనకు మద్దతుగా ఇంధన కటాఫ్ స్విచ్ల అమరిక, కాక్పిట్ ఆడియోను ప్రధానంగా ప్రస్తావించారు. "ఈ స్విచ్లు ఆటోమేటిక్గా ఆగిపోవు. వాటిని మానవీయంగానే (చేతులతో) ఆపాలి" అని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా విఫలం అయినప్పటికీ.. ఇవి స్విచ్ఛాఫ్ కావని తెలిపారు. అలాగే ఇవి జారిపోయే తరహా స్విచ్లు కావని.. ఒక స్లాట్లో కదలకుండా ఇవి స్విచ్చాఫ్ వీటిని డిజైన్ చేసినట్లు వెల్లడించారు. వీటిని ఎవరో ఒకరు పైకి, కిందకు పట్టుకుని లాగితేనే ఆన్, ఆఫ్ అవుతాయని పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా ఆఫ్ పొజిషన్కు రావడం అనేది ఎంత మాత్రమూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ఓ వ్యక్తి వాటిని ఆఫ్ పొజిషన్కు మార్చాలని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్న కచ్చితమైన సందర్భం అని వ్యాఖ్యానించారు.
పైలట్కు ఆరోగ్యం సరిగా లేని విషయం కూడా ఆయన అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విమాన కెప్టెన్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని.. ఈ విషయం చాలా మంది పైలట్లకు తెలిసినప్పటికీ.. ఎయిర్ ఇండియా ఉన్నత యాజమాన్యానికి తెలిసి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రంగనాథన్ కేవలం ప్రమాద కారణంపైనే కాకుండా దానిపై వెలువడిన అధికారిక నివేదికలోని లోపాలపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రమాద నివేదికలో సమాచారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా గుర్తించడంలో ఉన్న లోపాలు.. నివేదిక పారదర్శకతపై అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. పూర్తి స్పష్టత లేకపోవడం, కీలక వివరాలను విస్మరించడం వల్ల వాస్తవాలు దాచి పెడుతున్నారనే వెల్లడించారు.
ఈ సంచలన వాదనలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంపై దర్యాప్తును పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. కెప్టెన్ రంగనాథన్ చేసిన ఆరోపణలు.. విమానయాన భద్రతా ప్రోటోకాల్స్, పైలట్ల మానసిక ఆరోగ్యం, ప్రమాద నివేదికల పారదర్శకతపై మరింత లోతైన చర్చకు దారితీసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa