ఆర్మీ జవాన్ .. తన భార్య అనారోగ్యానికి గురికావడంతో సెలవు కోసం దరఖాస్తు చేశాడు. అయితే, ఉన్నతాధికారులు అతడి దరఖాస్తును తిరస్కరించినా.. ఊరికి వచ్చి ఆమెకు సర్జరీ చేయించాడు. అనంతరం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. తర్వాత తన బంధువుకు ఫోన్ చేసి తనకోసం వెతకొద్దని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి.. ఫోన్ కట్ చేశాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియకుండాపోయింది. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైన అతడి కోసం గాలిస్తోంది. చివరికి అతడి కారు, మొబైల్ ఫోన్ శ్రీశైలం డ్యామ్ సమీపంలో గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామానికి చెందిన నవీన్ ఆర్మీలొ జవాన్గా పనిచేస్తున్నాడు. అతడు రోజులుగా కనిపించడం లేదు. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన నవీన్, శ్రీశైలం వైపు కారులో వెళ్ళినట్లు సమాచారం.
ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా నవీన్ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదు. అయినా నవీన్ ఊరికి వచ్చి, భార్యకు శస్త్ర చికిత్స చేయించాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ, డ్యూటీకి వెళ్లకుండా శ్రీశైలం వైపు వెళ్ళాడు. శ్రీశైలం డ్యాం దగ్గర నుంచి నవీన్ తన బంధువుకు ఫోన్ చేసి.. ‘‘నా కోసం వెతకవద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పాడు. ఆ తరువాత డ్యాం దగ్గర కారులో పురుగుల మందు సీసా, మొబైల్ ఫోన్ వదిలి వెళ్ళిపోయాడు.
నవీన్ కనిపించకుండా పోవడంతో, ఆయన బంధువులు ఈగలపెంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, నవీన్ కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన గిరిపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. సెలవు దొరక్కపోవడంతో, మనస్తాపానికి గురై ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. నవీన్ ఏమయ్యాడు? అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటన ఆర్మీలో పనిచేసే ఉద్యోగుల ఒత్తిడి గురించి చర్చకు దారితీసింది. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa