కర్ణాటక గోకర్ణలోని ఓ గుహలో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి రహస్యంగా జీవిస్తున్న రష్యన్ మహిళ స్టోరీ వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె భర్తను కూడా అధికారులు గుర్తించారు. ఈక్రమంలోనే ఆయన విస్తుపోయే విషయాలు చెప్పారు. ముఖ్యంగా తన బిడ్డల కస్టడీ కోసం ఆయన చేస్తున్న న్యాయ పోరాటం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తాను కేవలం తండ్రిగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని.. వెంటనే ఇద్దరు కుమార్తెలను కలవాలని ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ రూపంలో విచారణకు వచ్చింది.
40 ఏళ్ల వయసు కల్గిన నీనా కుటీనా.. తన ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కల్గిన కుమార్తెలు ప్రేయా, అమాలతో కలిసి గోకర్ణలోని ఓ గుహలో రహస్యంగా జీవనం సాగిస్తోంది. ఇటీవలే కొండ చరియలు విరిగి పడడంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులకు నీనా కుటీనా.. పిల్లలతో సహా కనిపించగా షాక్ అయ్యారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆపై ఓ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉండగా.. రష్యాకు పంపించాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే ఆమెను విచారించగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. గత 15 ఏళ్లుగా 20 దేశాలు తిరిగిన ఆమెకు గుహల్లోనే నలుగురు బిడ్డలు జన్మించారని.. వారిలో ఒకరు రష్యాలో ఉండగా.. మరొకరు ఇటీవలే గుహలోనే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ఈక్రమంలోనే ఆమె భర్త గురించి పోలీసులు ఆరా తీయగా.. ఇజ్రాయెల్కు చెందిన ఓ వ్యాపారవేత్తనే ఈమె భర్త అని తెలిసింది. ఈక్రమంలోనే అతడి గుర్తించి మీడియా ముందుకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కల్గిన డ్రోర్ గోల్డ్ స్టెనిన్.. ఇజ్రాయెల్ జాతీయుడు. అయితే అతడికి నీనా కుటీనా గోవాలో పరిచయం అయినట్లు చెప్పాడు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలు కాగా.. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నట్లు వివరించాడు. ఫలితంగా తమకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని పేర్కొన్నాడు. అయితే చాలా రోజుల పాటు తనతో గోవాలోనే ఉన్న నీనా కుటీనా తనకు చెప్పకుండా వెళ్లిపోయిందని వివరించాడు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులకు తన భార్య, పిల్లలు అదృశ్యం అయినట్లు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపాడు.
.కానీ ఆ తర్వాత కొంత కాలానికే ఓ స్నేహితుడి ద్వారా తన భార్య, పిల్లలు గోకర్ణలోని గుహలో ఉన్నట్లు తెలిసిందని గోల్డ్ స్టెనిన్ వివరించాడు. ఆపై అక్కడకు వెళ్తే భార్య రానివ్వలేదని, పిల్లల్ని కూడా కలవనివ్వలేదని చెప్పాడు. ప్రస్తుతం తనకు తన ఇద్దరు కుమార్తెలు కావాలని.. తానొక మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నట్లు వివరించాడు. అలాగే వారిని రష్యా పంపొద్దని.. అలా పంపిస్తే తనకు వాళ్లను మళ్లీ కలిసే అవకాశం కూడా ఉండదని వెల్లడించాడు. తన రెండో కుమార్తె ఇండియాలోనే పుట్టిందని.. కాబట్టి ఆమెకు ఇక్కడి పౌరసత్వమే ఉంటుందని కూడా చెప్పాడు. తాను ఇజ్రాయెలీ కావడం వల్ల న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని.. పిల్లలిద్దరినీ షేర్డ్ కస్టడీకి అప్పగించాలని కోరాడు.
గుహలో నివసించడం వల్ల పిల్లలకు సరైన విద్య, వైద్య, సంరక్షణ అందడం లేదని.. ఇది వారి భవిష్యత్తుకు హానికరం అని డ్రోర్ గోల్డ్ స్టెనిన్ పేర్కొన్నాడు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుని.. పిల్లలను కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది. అయితే విచారణలో భాగంగా పిల్లల్ని ఎవరి ఉండాలనుందని ప్రశ్నించగా.. తమ తల్లితోనే ఉండాలనుకుంటున్నట్లు చెప్పాకు. కానీ న్యాయస్థానం వారి తండ్రి.. వారిని కలవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa