ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సవాళ్లు ప్రతిసవాళ్లతో వేడెక్కిన చిత్తూరు,,,రోజా వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 08:23 PM

టీడీపీ ఎమ్మెల్యే గాలి సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో నగరి రాజకీయం వేడెక్కింది. వైసీపీ హయాంలో రోజా అవినీతికి పాల్పడ్డారని, ఆమె అక్రమాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించి.. కౌంటర్ ఇచ్చారు. దీంతో నగరి రాజకీయాలు హాట్‌ హాట్‌‌గా మారాయి. తొలుత టీడీపీ ఎమ్మెల్యే.. రోజాకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చెయ్యాలని. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్న సరే అంటూ రోజాకు సవాల్ విసిరారు.


‘‘గత ఐదేళ్లూ ఇసుక ,బియ్యం అక్రమ రవాణాలో రోజా, అమె సోదరులు, అమె అనుచరులకు సంబంధం లేదని చెప్పగలదా? . ప్రమాణం చేయాగలదా? నేను ప్రమాణం చేయడానికి సిద్దం ‌...నువ్వు సిద్దమా? దోంగే.‌. దోంగ అన్నట్లుగా ఉంది రోజా మాటలు.. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ‌‌, పట్టించిందే మేము. అడ్డంగా దోరికిపోయి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు... రోజాకున్న అవినీతి అలవాట్లు మాకు రుద్దే ప్రయత్నం చేస్తోంది... రోజా కళ్లకు ఎమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గర‌కు వెళ్లి చెక్ చేయించుకోవాలి.. నగరి చరిత్రలో ఎన్నుడు లేని విధంగా ఎడాదిలోనే వందల కోత్త రోడ్లు వేశాను, బోర్లు,కాలువలు ఇతర అభివృద్ధి చేశాను.... రోజా ఎప్పుడైనా నియోజకవర్గంలోని ఊర్లు తిరిగితే కథ తెలుస్తుంది‌‌... అబద్ధాలు చెప్పి కాలం గడపాలనుకునే రోజులు పోయాయని రోజా గుర్తుపెట్టుకోవాలీ.. సోషల్ మీడియాలోనూ నీకు తెలిసిన ఛానల్లోనూ అబద్ధాలు చెబితే నిజమైపోదు..


12వేలు అద్దె ఇళ్ల నుంచి ఇప్పుడు నగరి,హైదరాబాదు, చెన్నై ఇలా ఊరికోక ఇళ్ళు కట్టున్నావు..... ఇవన్ని ఎలా‌ సంపాదించావ్? నీకు హావభావాలు, వెకిలిచేష్టాలు అన్ని ప్రజలకు తెలుసు... ఒక మహిళ ఎలా ఉండకూడదు అన్నదానికి ప్రతిబింబం నువ్వు.. మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్లు ‌...మిమ్మల్ని చీదరించి బంగాళాఖాతంలో కలిపేస్తే ప్రజలు ఓట్లు వేయానట్లా...? రోజా వాళ్ల బాస్ జగన్ ఒక మంచి హాస్పటల్‌కి తీసుకెళ్లి చూపించుకుంటే మంచిది‌... జగన్‌కు మిడియా సంస్థలే లేదంటారు‌. జనాలు ఎమైనా పిచ్చొళ్లు అనుకుంటున్నారా? మరి సాక్షి పేపర్,ఛానల్ ఎవరివి? తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే అది రోజా అయినా నేనైనా.. ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతాం... అవసరం అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పాను’’ అని ఎమ్మెల్యే భాను ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను నిలదీశారు. ‘‘టీడీపీ- జనసేన కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తోంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు ఎలా పెట్టాలో ఏపీలో స్టడీ చేయాలి.. గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్.. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు.. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏమి చేస్తున్నారు.. అరెస్ట్. చేసినా వారికి వెంటనే బెయిల్ వచ్చింది.. ఈ వార్తను షేర్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను నగరి సీఐ వేధింపులకు గురిచేస్తున్నారు.. సుప్రీం కోర్టు సోషల్ మీడియా అక్రమ అరెస్టులు చేయొద్దని స్పష్టంగా చెప్పిన అక్రమ అరెస్టులు చేస్తున్నారు..వేణు అండ్ కో బ్యాచ్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు అరెస్ట్ అయ్యారు.. ఇసుక మాఫియా తప్పుడు కేసులు పెడుతున్నారు..


వైసీపీ కౌన్సిలర్లు బీడీ భాస్కర్ , బిలాల్‌లను అరెస్టు చేసి, తప్పుడు కేసులు బనాయించారు.. చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. నగరిలో బియ్యం మాఫియా, టిడిపి నేత అమృత రాజ్‌ను అరెస్ట్ చేసి.. వెంటనే అతడికి బెయిల్ ఎలా ఇచ్చారు? భరత్ కాల్ డేటా తీయండి, అందరిపై కేసులు పెట్టండి’’ అని మాజీ రోజా మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa