తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రముఖ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఆయన, టీడీపీ వ్యవస్థాపన దశల నుంచే కీలక పాత్ర పోషించారు. రాజకీయనాయకుడిగా ఆయన తీసుకున్న ఈ కీలక నిర్ణయం పార్టీలో మరియు ఆయన అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
అశోక్ గజపతిరాజు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. పార్టీకి తన సేవలు ముగింపు పలుకుతున్నట్లు లేఖలో పేర్కొన్న ఆయన, ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ నిర్ణయానికి స్పష్టమైన కారణాల్ని మాత్రం ఆయన బహిరంగంగా వెల్లడించలేదు.
తెలుగుదేశం పార్టీకి చాలా సంవత్సరాలపాటు నిబద్ధతతో సేవలందించిన అశోక్ గజపతిరాజు పార్టీకి రాజీనామా చేయడం విశేషమే. ఆయన రాజకీయ జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్ కావొచ్చని భావిస్తున్నారు. ఇకపోతే, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa