ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది

national |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 09:20 PM

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న రన్‌వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఎయిర్‌పోర్టు మూసివేతను మూడోసారి పొడిగించింది. ఆగస్ట్ 5 వరకు రన్‌వే మూసివేసి ఉంటుందని పాకిస్థాన్ తాజాగా నోటమ్ విడుదల చేసింది. విమానయాన కార్యకలాపాలు అందుబాటులో ఉండవని పేర్కొంది.అయితే మూసివేతకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే 10న భారత్ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటమ్ జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్‌బేస్ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని ప్రకటించింది. ఆ తర్వాత గత నెల నాలుగో తేదీన రెండో నోటమ్ జారీ చేసింది. మూసివేతను జులై 4 వరకు పొడిగించింది. తాజాగా ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa