భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్, అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్లో కీలకంగా మారింది. ఈ మ్యాచ్ జూలై 23 నుండి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది, కాబట్టి ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ను 2-2తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు మాంచెస్టర్లో భారత్కు విజయం లేదు—9 మ్యాచ్లలో ఒక్క గెలుపు కూడా లేదు. అయితే, గిల్ సారథ్యంలోని జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ మరియు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ భారత జట్లలోనే ఉన్నారు. "మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో మణికట్టు స్పిన్నర్లు చక్రం తిప్పుతారు అని అందరికి తెలుసు. కాబట్టి భారత్ బుమ్రా, సిరాజ్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, జడేజా,కుల్దీప్ యాదవ్లతో ఆడితే బాగుంటుంది.ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే మాంచెస్టర్లో వాతావరణ పరిస్థితులపై మనకు అంచనా లేదు. ఒకవేళ వాతావరణం చల్లగా ఉండి, వర్షం పడితే ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తోంది. కానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం కోసం భారత మెనెజ్మెంట్ కచ్చితంగా ఆలోచించాలి" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ అథర్టన్ పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa