పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరగనుండగా, ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్ మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది.ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ-సంపద స్థలాలు, భూపరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ సవరణ బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, భారతీయ నిర్వహణ సంస్థల బిల్లు, మరియు పన్ను చట్టాల బిల్లు ఉన్నాయి. అలాగే, ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. దీనిని సోమవారం లోక్సభలో దీనిని సమర్పించే అవకాశం ఉంది. ఇంకా, మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి మరియు రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ఆమోదించడానికి పార్లమెంట్ అనుమతిని కోరనుంది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకాయాన బిల్లు 2024, మరియు భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి.ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్తో సహా ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా సాగనుంది. బీహార్లో ఎన్నికల జాబితాల వివాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలు ఈ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa