వారం రోజుల కిందట భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. భర్తపైనే పోలీసులు కేసు నమోదు చేసి లోపల వేశారు. ఎందుకంటే అతడి భార్య మైనర్ కావడమే ఇందులో పెద్ద ట్విస్ట్. తనను చంపడానికి ప్రయత్నించిన భార్యపై కేసు నమోదుచేయాలంటూ పోలీసు స్టేషన్కు వెళ్లిన భర్తకు పోలీసులు షాకిచ్చారు. అతడిపై పోక్సో చట్టం కిందట కేసు నమోదు చేశారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్పకు యాదగిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. ఈ జంట సరదాగా తిరిగొద్దామని బైక్పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. అయితే, మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. అలా భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి సెల్ఫీ తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ సెల్ఫీ తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. ఆ తర్వాత తాతప్ప తల్లికి ఫోన్ చేసి ఆయన నదిలో పడిపోయాడని చెప్పింది.
అదృష్టవశాత్తూ నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరుకుని ‘‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేశాడు. అతడి భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.
ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ స్పందించారు. ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయతీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఫిర్యాదు చేస్తామని అన్నట్టు ఎస్ఐ తెలిపారు. అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారడంతో.. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. పాపం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa