ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 15న అన్నదాత సుఖీభవ అమలుచేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 12:01 PM

రైతుల పేరు చెప్పుకుని నాడు అధికారంలోకి వచ్చి మోటార్లకు మీటర్లు బిగించి రైతులను మోసగించిన జగన్‌రెడ్డి నేడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని కొంగళవీడు, బయనపల్లె, కొమ్మునూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నా రు. ఈసందర్భంగా కొంగళవీడు గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కొంగళవీడు నుంచి నరవ గ్రామానికి రూ.3.20కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆయన ప్రారంభించారు. వేములపాడు, కొమ్మునూరు గ్రామాలలో రూ.20లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్డుకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గడిచిన ఏడాదిలో మహిళలు, రైతుల సంక్షేమంతోపాటు యువత భవిష్యత్‌ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు చేసిందేమీ లేదని, కానీ జగన్‌రెడ్డి ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం గిట్టుబాటు ధరలు, పొగాకు, మామిడి కొనుగోళ్లకు కృషి చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని మొదటిగా ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, మీసాల పాపయ్య, బాబాయి, మీసాల రమేష్‌ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa