అందరికీ సంక్షేమ పథకాలు అందినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా వినూత్న పథకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలోని ఎస్టీ కాలనీలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ పెంచి వారు గౌరంగా జీవించేలా చేశారన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరూ చదువుకునేలా మార్గం చూపారని తెలిపారు. ఇలా అన్నివర్గాల ప్రజలకు చేయూత నిచ్చేలా సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు సుబ్బారావు, సత్యనారాయణగౌడ్, యక్కలి తిమ్మయ్య, డి.వెంకట్రావు, కిశోర్, పట్టణ అధ్యక్షులు పీ మల్లికార్జునరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ గపూర్, బ్రహ్మారెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa