ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంపుడు ఏనుగు వల్లే ప్రాణాలు కోల్పోయిన మల్టీ మిలియనీర్ సీఈఓ!

international |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 07:40 PM

తాను పెంచుకుంటున్న ఓ పెంపుడు ఏనుగు వల్లే ఓ కోటీశ్వరుడైన సీఈఓ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దాన్ని పక్కకు తరలిస్తుండగా.. అక్కడే నిల్చుని ఉన్న ఆయన్ను ఏనుగు తొక్కేసింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జూలై 22వ తేదీ ఉదయం 8 గంటలకు జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


దక్షిణాఫ్రికాలోని గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ సీఈఓగా.. మల్టీ మిలియనీర్ అయిన 39 ఏళ్ల ఎఫ్‌సి కాన్రాడీ పని చేస్తున్నారు. అలాగే కైలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కూడా యజమాని. అయితే ఏకో టూరిజంలో కాన్రాడీ అందరికీ సుపరిచితులు కాగా.. మొదటి నుంచి ఆయనకు ఏనుగులు, ప్రకృతి పట్ల అమితమైన ప్రేమ ఉండేది. జంతుశాస్త్రం (జూవాలజీ), జంతు అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్ వంటి విభాగాలలో ఆయన గౌరవ డిగ్రీలు కూడా పొందారు. ఈక్రమంలోనే గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్థాపించారు.


ముఖ్యంగా ఇక్కడ ఫైవ్ స్టార్ సఫారీ లాడ్జిని కూడా ఏర్పాటు చేశారు. అది మాత్రమే కాకుండా బిగ్ ఫైవ్ (ఆఫ్రికా సింహం, ఏనుగు, చిరుతపులి, కేప్ బఫెలో, ఖడ్గమృగం)ను చూసిన అనుభూతి కోసం ఇక్కడకు పెద్ద ఎత్తున ప్రముఖులు, పర్యాటకులు వస్తుంటారు. ఈక్రమంలోనే సీఈఓ కాన్రాడీ కూడా ఎక్కువగా అక్కడకు వచ్చి రోజువారీ కార్యాకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటిలాగే మంగళవారం రోజు కూడా రాగా.. ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా టూరిస్టు లాడ్జిలకు దూరంగా ఏనుగుల గుంపును తోలుతుండగా.. ఒకటి మాత్రం విపరీతంగా ప్రవర్తించింది.


ఈక్రమంలోనే పక్కనే ఉన్న కెన్రాడీని తన దంతాలతో నెట్టి, పలుమార్లు తొక్కి చంపింది. ఈ వియాన్ని నేరుగా అక్కడే ఉన్న రేంజర్లు చెప్పారు. వారు కాపాడేందుకు విపరీతంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించారు. తమ ముందే తమ సీఈఓ ప్రాణాలు కోల్పోయారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఇక్కడ ఇదే తొలి మరణం కాదు. 2023 మార్చిలో కూడా అచ్చంగా ఇలాంటి ఓ దాడే జరిగింది. ఏనుగు చేసిన బీభత్సంలో డేవిడ్ కండేలా అనే ఓ సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో.. ఆటవిక వన్యప్రాణి రిజర్వ్‌లలో భద్రతా ప్రోటోకాల్స్‌పై తీవ్ర చర్చకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa