ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి బాదం నానబెట్టి ఉదయాన్నే తినడం ఎలా మీ ఆరోగ్యం మారుస్తుందో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:34 PM

బాదంను మామూలుగా తినడం కంటే రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.బాదం పప్పును రాత్రంతా నానబెట్టి తింటే?
రోజూ గుప్పెడు బాదం పప్పు లను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం అనే సంగతి తెలిసిందే. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మామూలుగా తినడం కంటే రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నీటిలో నానబెట్టడం వల్ల అవి మరింత రుచికరంగానూ ఉంటాయి. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా ఇది అడ్డుపడుతుంది.బాదం పప్పు ఎక్కువ సేపు నీటిలో నానబెట్టడం వల్ల ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది. రోజూ బాదం పప్పు తినడం వల్ల వీటిలోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన రావడం వల్ల తేలిగ్గా బరువు తగ్గించుకోవచ్చు. నానబెట్టిన బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వయసు మీద పడటం, వృద్ధాప్య ఛాయల నుంచి ఇది కాపాడుతుంది. ఇందులో విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌తో పోరాడతాయి. పుట్టుకతోపాటు వచ్చే లోపాలను తగ్గిస్తాయి.ఇంతకూ నీటిలో నానబెట్టడం ఎలా అనే విషయంలో ఎలా అనుకుంటున్నారా? గుప్పెడు బాదం పప్పులను ఒక చిన్న గిన్నెలో వేసి అవి మునిగేలా నీరు పోయాలి. తర్వాత మూతపెట్టి సుమారు 8 గంటలు నాననివ్వాలి. తర్వాత వాటి తోలు తీసి తినేయాలి. తోలు తీశాక ప్లాస్టిక్ బాక్సులో ఉంచి మూత పెడితే ఐదారు రోజులు నిల్వ ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa