అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన పదవీకాలంలో వలసలపై కఠిన విధానాలకు ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో, యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లౌ, నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వీసా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పౌరసత్వ పరీక్షలు అత్యంత సులభంగా ఉన్నాయని, దేశభక్తి, అర్హతలను మరింత కఠినంగా పరీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
హెచ్-1బీ వీసా వ్యవస్థను అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు పునర్విమర్శ చేయాలని ఎడ్లౌ పేర్కొన్నారు. ట్రంప్ తొలి పదవీకాలంలో వలస వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనప్పటికీ, జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణలు వెనక్కి తీసుకోబడ్డాయి. అయితే, ప్రస్తుతం అమెరికా మరోసారి వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. వీసా జారీకి సోషల్ మీడియా వెరిఫికేషన్ను తప్పనిసరి చేయడం, నిబంధనలు అతిక్రమిస్తే బహిష్కరణ చర్యలు తీసుకునే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
అమెరికా పౌరసత్వం కోసం కొత్త పద్ధతులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక వినూత్న ప్రతిపాదనగా, రియాలిటీ షో రూపంలో అభ్యర్థుల దేశభక్తిని, నిబద్ధతను పరీక్షించే కార్యక్రమం నిర్వహించే ఆలోచనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ షోలో పోటీదారులు అమెరికా విలువలు, అవగాహనను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఈ మార్పులన్నీ అమెరికా వలస విధానాలు మరింత కఠినమైన దిశగా సాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. నైపుణ్యం కలిగిన వలసదారులకు అవకాశాలు కల్పిస్తూనే, దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa