బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేటీఆర్.. కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక సీఎం రమేష్ ఉన్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సహాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రమేష్కు ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్టు ఇప్పించారంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై సీఎం రమేష్ స్పందించారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ పనులకు సంబంధించి తనపై ఆరోపణలు చేయటం మూర్ఖత్వమని సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని రూల్స్ ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ ఇచ్చారన్నారు.పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్కు నామినేషన్ పద్ధతిలో రూ.1660 కోట్ల కాంట్రాక్టు పనులు ఇస్తారా ఇవ్వరా అనే నిబంధనలు తెలియవా అని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఏపీలో వైఎస్ జగన్కు చెల్లెలితో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్కు కూడా కూడా చెల్లెలి పోరు ఉన్నట్లుందని అన్నారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలలు అయ్యిందని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎవరికైనా కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటే రూ.5 లక్షలకు మించి నామినేషన్ పద్ధతిలో ఇచ్చే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మీద సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైళ్లో ఉన్న సమయంలో ఢిల్లీలోని తన ఇంటికి కేటీఆర్ వచ్చారన్న కేటీఆర్.. కవితను వదిలేస్తే బీజేపీతో పొత్తు, విలీనం చేస్తామని ప్రతిపాదించలేదా అని సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa