ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రధాన నిందితుడిగా రాజ్ కెసిరెడ్డిని గుర్తించింది. ఆయనతో పాటు, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) పనిచేసిన పలువురు కీలక అధికారులు కూడా ఈ స్కాంలో ప్రమేయం కలిగి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
సిట్ దర్యాప్తులోకి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలోనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కాం పరంగా కీలక ఆధారాలను సేకరించిన తర్వాత, రాజ్ కెసిరెడ్డితో పాటు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను అరెస్టు చేసింది. ఈ చర్యలతో రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారిన ఈ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇందులో మరో ముఖ్య మలుపుగా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. దీంతో, కేసు మరింత రాజకీయ రంగు దాల్చింది. ఇప్పటికే అరెస్టుల తర్వాత నిందితులను రిమాండ్కు తరలించిన సిట్, మరిన్ని కీలక బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తును ముమ్మరం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa