ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ప్రాణం విడిచాడు..

national |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 11:55 AM

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయస్సులోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ దుర్ఘటన ఆలోచించేలా చేస్తుంది.పూణేలోని పింప్రి-చించ్‌వాడ్‌లో ఒక జిమ్‌లో శుక్రవారం 37 ఏళ్ల మిలింద్ కులకర్ణి అనే యువకుడు వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు తాగుతూ కనిపించాడు. ఆ క్రమంలోనే కళ్లు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోయాడు.దీంతో జిమ్‌లో ఉన్నవాళ్లు వెంటనే గమనించి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ, ఆస్పత్రికి చేరే సమయానికే మిలింద్ కులకర్ణి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. డాక్టర్లు చెప్పిన ప్రకారం, అతనికి గుండెపోటు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిలింద్ భార్య స్వయంగా ఒక డాక్టర్ కావడం విశేషం. గత ఆరు నెలలుగా అతను రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్తున్నాడని తెలిసింది.ఈ సంఘటన అనేక మందిని కలచివేస్తుంది. ఆ యువకుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని జిమ్‌కి వెళ్లాడు. కానీ, అక్కడే అతని జీవితం ఆగిపోయింది. ఇలాంటి సంఘటనలు అనేక మందిలో భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి ఊహించని మలుపులు వారి జీవితాలను మార్చేస్తాయని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa