ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదంగా ముగిసిన అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి ఫ్యామిలీ కథ

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 08:30 PM

అమెరికాలో నాలుగు రోజుల కిందట అదృశ్యమైన భారత సంతతికి చెందిన కుటుంబం కథ విషాదంతమయ్యింది. జులై 29న ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తూ వీరు కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై లోయలోకి దూసుకెళ్లినట్టు గుర్తించారు. న్యూయార్క్‌లో నివాసం ఉండే భారత సంతతికి చెందిన ఆశా దివాన్ (85), కిషోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)‌లు వెస్టు వెర్జీనియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. శనివారం రాత్రి నలుగురు వృద్ధుల మృతదేహాలను గుర్తించినట్టు మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డౌగర్టీ ఆదివారం వెల్లడించారు.


వీళ్లు న్యూయార్క్ నుంచి మార్షల్ కౌంటీ, వెస్ట్ వెర్జీనియాలోని ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిందని తెలిపారు. మృతదేహాలు, వాహనం స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రహదారి పక్కనే ఉన్న లోయలో కనుగొనట్టు వివరించారు. అమెరికాలో మిస్సైన భారతీయులు ప్రమావంలో ప్రాణాలు కోల్పోయాయి.


‘వాహన ప్రమాదంలో నలుగురూ మరణించారు. రెస్క్యూ సిబ్బంది దాదాపు ఐదు గంటలు పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు.. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి’ అని షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. చివరిసారి జులై 29న పెన్సిల్వేనియాలోని బర్గర్ కింగ్ వద్ద వృద్ధులు కనిపించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. వారి చివరి క్రెడిట్ కార్డు లావాదేవీలు కూడా అక్కడే జరిగాయి. ఇటీవల అమెరికాలో పలువురు భారతీయుల మరణాలు, కనిపించకుండపోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.


అక్కడ నుంచి వెళ్లిన తర్వాత పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ లైసెన్స్ ప్లేట్ రీడర్ వారి వాహనాన్ని I-79 రహదారపై ప్రయాణిస్తున్నట్టు గుర్తించింది. వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది... స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపటి.. వాహన వివరాలను నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో నమోదుచేశారు. అలాగే, న్యూయార్క్‌లోని కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ కూడా అదృశ్యమైన భారతీయులను ఆచూకీ తెలుసుకోడానికి సహకరించింది. చివరకు రోడ్డు ప్రమాదంలో నలుగురూ దుర్మరణం చెందడంతో తీరని విషాదం మిగిల్సింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa