ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేకాడుతూ దొరికిపోయిన మహిళలు.... డబ్బు స్వాధీనం

Crime |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 10:17 PM

విశాఖపట్నంలో జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్ట్. లలితానగర్ ప్రాంతంలో కొందరు మహిళలు జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి దాడి చేసి ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 22 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. అయితే ఈ మహిళలు తరచూ వారి ఇళ్లలో పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది.


కొంతకాలంగా మహిళలు పేకాట ఆడుతున్నట్లు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ పేకాట ఆడుతున్నవాళ్లలో ఓ మహిళ భర్త పోలీసులకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారట. తన భార్య రోజూ జూదం ఆడుతున్నట్లు పోలీసులకు చెప్పారట. ఆ తర్వాత ఆయనే పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతోనే నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఈ పేకాట ఎపిసోడ్ స్థానికంగా సంచలనంగా మారింది. ఆడవాళ్లు పేకాట ఆడటం కామన్ అనుకున్నా.. వారిలో ఒకరి భర్త ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌‌టాపిక్ అయ్యింది.


విశాఖపట్నంలో కొంతకాలంగా ఈ మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. వీరు గత కొంతకాలంగా ఒక బిల్డింగ్‌లో మినీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయట. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేకాట ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సరదాగా ఇళ్లలో పేకాట ఆడుకుంటారు.. కానీ వీళ్లు డబ్బులతో ఆడుతున్నట్లు తేలింది.


ఏపీ పోలీసులు ఇటీవల కాలంలో డ్రోన్‌ సాయంతో పేకాట రాయుళ్లు, మందుబాబులో ఆటకట్టిస్తున్నారు.. పలు జిల్లాల్లో పోలీసులకు దొరక్కుండా.. ఎక్కడో దూరంగా పొలాల్లో, దూరంగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు డ్రోన్ అలా పైకి ఎగరేయగానే.. పేకాటరాయుళ్లు ఇలా దొరికిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa