బెంగళూరులో ఘోర దుర్ఘటన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలకంగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వసతులు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, కర్ణాటక హౌసింగ్ బోర్డు (KHB) ఆధ్వర్యంలో సూర్య సిటీ, బొమ్మాసంద్ర ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రీడా సముదాయం నిర్మించేందుకు ఆయన ఆమోదం తెలిపారు.
ఈ ప్రాజెక్టులో ముఖ్య ఆకర్షణగా 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఇది పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం తరువాత దేశంలో రెండవ అతిపెద్ద స్టేడియంగా నిలవనుంది. ఇది కేవలం క్రీడా అభివృద్ధికే కాకుండా, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురానుంది.
క్రీడా సముదాయంలో క్రికెట్ మాత్రమే కాకుండా, ఫుట్బాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడలకు వేదికలు ఏర్పాటవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించే ఈ సముదాయం, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. అంతే కాక, శిక్షణా కేంద్రాలు, హాస్టళ్లు, సదుపాయాలు కలిగిన క్రీడా అకాడమీ కూడా ఇందులో భాగమవుతుంది.
ఈ ప్రాజెక్టుతో బెంగళూరు క్రీడా రంగంలో గ్లోబల్ మ్యాప్ మీద నిలవనుంది. అలాగే, క్రీడా పర్యాటన, ఉపాధి అవకాశాలు, మౌలిక వృద్ధితో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేయనుంది. త్వరలో నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న ఈ ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa