కంటి పాపలా చూసుకోవాల్సిన కన్న కూతురుపైనే.. ఓ నరరూప రాక్షసుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో.. మైనర్ అయిన కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డాడు. కన్నూ మిన్నూ కానకుండా.. కడుపున పుట్టిన బిడ్డపైనే కామాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆ 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అప్పటికీ ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు. చివరికి ఆమెకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తన ఇంట్లోనే బిడ్డకు ప్రసవం చేయించాడు. ప్రసవం తర్వాత ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకెళ్లి.. దూరంగా విసిరేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన మానవత్వానికే ఒక మచ్చలాగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని పొదల్లో చీమలు కుట్టిన స్థితిలో ఒక రోజు వయసు ఉన్న పసికందును శనివారం స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స చేయించి.. ఖర్గోన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
దర్యాప్తులో భాగంగా.. ఆ పసికందు తల్లి 16 ఏళ్ల బాలిక అని గుర్తించారు. ప్రస్తుతం ఆ బాలిక ఒక చిన్న క్లినిక్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ బాలికను విచారించగా.. పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్లోని రాజ్కోట్లో కూలీలుగా పనిచేస్తున్న సమయంలో.. ఎవరూ లేని సమయంలో తన తండ్రి తనను రేప్ చేశాడని తెలిపింది. ఆ తర్వాత తాను గర్భం దాల్చినట్లు పోలీసులకు ఆ బాలిక చెప్పుకొచ్చింది.
9 నెలలు నిండిన తర్వాత తమ ఇంట్లోనే తండ్రి ప్రసవం చేయించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులకు అన్ని విషయాలు బాలిక చెప్పింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డను చెట్ల పొదల్లో పడేసి నిందితుడు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టంతోపాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.
ఇక ఆ పసికందు, బాధితురాలు, నిందితుడి డీఎన్ఏ నమూనాలను సేకరించి.. వాటిని ల్యాబ్కు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ శిశువును ఖర్గోన్లో చికిత్స అందించిన తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఇండోర్లోని ఎంటీహెచ్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై ఉంచినట్లు డాక్టర్లు చెప్పారు. కన్నతండ్రే తన కుమార్తెను గర్భవతిని చేసి.. ప్రసవించిన తర్వాత నవజాత శిశువును చెట్ల పొదల్లో పడేసి పరారైన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa